తెలుగు రాష్ట్రాలపై సమదృష్టి

 

తెలుగు రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను రాజ్‌భవన్ విడుదల చేసింది. విధుల నిర్వహణలో రాష్ట్రాల మధ్య వివక్ష చూపడం లేదని, రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నామని రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. సీఎస్‌లు, సలహాదార్లతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని, ఎలాంటి పక్షపాతం లేకుండా వివాదాలకు అతీతంగా పనిచేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వున్న నరసింహన్ ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తు్న్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది.