గంగా ప్రక్షాళనకు జర్మనీ చేయూత..!

 

భారతదేశ ప్రజలు అతి పవిత్రంగా భావించే గంగానది శుద్ధి కోసం కేంద్రప్రభుత్వం నడుం బిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహత్కార్యంలో భారత్ కు సాయంగా తాముంటామంటూ జర్మనీ ముందుకొచ్చింది. రివర్ బేసిన మ్యానేజ్ మెంట్ పద్ధతి ద్వారా, గంగానదిని శుద్ధి చేసేందుకు సాయం చేస్తామని జర్మనీ పేర్కొంది. దీనికి సంబంధించి భారత కేంద్ర జలవనరుల శాఖ, జర్మనీ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కలిసి ఒప్పందంపై సంతకాలు చేశాయి. గంగానదీ పరీవాహక తీరప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువైపోవడం, ఫ్యాక్టరీ వ్యర్ధాలను గంగలోకి వదిలెయ్యడం వంటి పనుల కారణంగా, దశాబ్దాల పాటు గంగానది తీవ్రంగా కలుషితమౌతూ వస్తోంది. మోడీ అధికారంలోకి రాకముందు, గంగా ప్రక్షాళన కూడా తమ మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగానది ప్రక్షాళన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. జర్మనీలోని డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన రివర్ బేసిన మ్యానేజ్ మెంట్ విధానం ద్వారానే గంగను కూడా క్లీన్ చేయబోతున్నారు. 2016 నుంచి 2018 వరకూ మూడేళ్లపాటు జర్మనీ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu