నలుగురు విద్యార్థుల కిడ్నాప్?

 

కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు కిడ్నాప్‌కి గురైనట్టు తెలుస్తోంది. జిల్లాలోని మంత్రాలయం మండలం సాతూరు గ్రామానికి చెందిన వీరేష్‌(13), రఘు(10), దేవన్న(12), అన్వర్‌(12) గురువారం ఉదయం స్కూలు వెళ్లిన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అదృశ్యమైన విద్యార్థుల్లో ఒక విద్యార్థి దగ్గరున్న సెల్ ఫోన్ నుంచి అతని తల్లిదండ్రులకు తాము కిడ్నాప్ అయ్యామన్న మెసేజ్ వచ్చింది. తమను కొంతమంది కిడ్నాప్ చేసి బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బంధించి హింసిస్తున్నారని కూడా ఆ మెసేజ్‌లో వుంది. దాంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.