ఆళ్లగడ్డలో అఖిలప్రియ నామినేషన్

 

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట తండ్రి భూమా నాగిరెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం ఎన్నికలో గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu