తులసిరెడ్డికి అస్వస్థత

 

మాజీ ఎంపీ తులసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం కేర్ ఆస్పత్రిలో చేరారు. కేర్ వైద్యులు ఆయనకు ఉపశమనం కలిగించడంతో ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వున్నట్టు తెలుస్తోంది. తులసిరెడ్డి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో వున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. సమైక్యవాదిగా పోరాటం చేసిన తులసిరెడ్డి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు.