మాజీ మావోయిస్టు దారుణ హత్య

 

మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మావోయిస్టు, జిల్లా కార్యదర్శి గుణగంటి శ్యామ్ అలియాస్ యాదయ్యగౌడ్(36) ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు మారణాయుధాలతో దారుణంగా నరకడంతో గుణగంటి శ్యామ్ కుప్పకూలిపోయాడు. వెల్దండ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో శ్యామ్ భార్య, కుమారులకు కూడా గాయాలయ్యాయి. శ్యామ్ అలియాస్ యాదయ్యగౌడ్ తన గ్రామం నుంచి భార్య, పిల్లలతో ద్విచక్ర వాహనంపై వెల్దండ వైపు వస్తుండగా కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు.