బోరు వేసినా  నీళ్లు రాకపోవడంతో తెలంగాణలో రైతు ఆత్మహత్య

ఆరుగాలం కష్ట పడిన రైతు గిట్టుబాటు లేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో  మరో  రైతు  గురువారం(10 ఏప్రిల్) పొద్దుపోయాక ఆత్మహత్య  చేసుకున్నాడు.  తన వ్యవసాయ భూమిలో నీళ్లు పడకపోతే మరో చోట బోర్ వేసినప్పటికీ నీళ్లు పడటం లేదు.   గత దశాబ్ద కాలం నుంచి  లక్షలాది రూపాయలు ఖర్చు చేసి 30 బోర్లు వేయించినా  ఎలాంటి ప్రయోజనం  లేకుండా పోయింది. దీంతో అప్పుల ఊబిలో చిక్కుక్కున్న 56 ఏళ్ల మల్నన్న సుసైడ్ చేసుకున్నాడు.  ఈ విషాద ఘటన  జిల్లాలోని లోకేశ్వరం మండలం, రాజురా గ్రామంలో జరిగింది. చనిపోయిన  మల్లన్నకు  తనకు వారసత్వంగా వచ్చిన ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన తన పొలంలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేవాడు. పంటలు తరచూ ఎండిపోవడంతో  నీటి కోసం పలుమార్లు బోర్లు వేయిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చుచేశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్నాడు.