కరోనాతో ఏపీ మాజీ మంత్రి మృతి

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) కన్నుమూశారు. ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో గ‌త‌ నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నేడు తుదిశ్వాస విడిశారు. 

 

పశ్చిగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 

 

మాణిక్యాలరావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు.