టీడీపీ నాయకుల మధ్య విబేధాలు..

ఇప్పటికే తెలంగాణ టీడీపీ కష్టాల్లో ఉండే.. ఇక్కడ ఏపీలో కూడా టీడీపీ నాయకుల మధ్య విభేధాలతో తలనొప్పులు తయారవుతున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంపై మంత్రి పుల్లరావు వ్యాఖ్యలు సరికావని, పుల్లారావుతో సహా మంత్రులు ఎవరైనా అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని.. మంత్రి పుల్లారావు తాను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖపై పూర్తి స్థాయిలో దృష్టిపెడితే మంచిదని సూచించారు. సున్నితమైన అంశాన్ని మాటల ద్వారా జటిలం చేయడం సరికాదని హితవు పలికారు. మరి డొక్కా మాటలకు పుల్లారావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu