తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరమల భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. శనివారం (జూన్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

టోకెన్ల లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శుక్రవారం (జూన్ 6) శ్రీవారిని మొత్తం72 వేల 174 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల 192 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల88 లక్షల రూపాయలు వచ్చింది.