తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం (జూన్8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులలో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు తిరమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (జూన్ 7) శ్రీవారిని మొత్తం 88 వేల 257 మంది దర్శించుకున్నారు. వారిలో 45 వేల 068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 68 లక్షల రూపాయలు వచ్చింది.