సినీ రచయిత సత్యమూర్తి కన్నుమూత
posted on Dec 14, 2015 6:36AM

ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుఝామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచారు.ఆయన దాదాపు వంద చిత్రాలకు రచయితగా పనిచేశారు. ‘దేవత’, ‘చంటి’, ‘ఛాలెంజ్’, ‘భలేదొంగ’ వంటి సినిమాలకు సత్యమూర్తే రచయిత. తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా రాణించడానికి సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో వుంది. కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురైన సత్యమూర్తిని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సత్యమూర్తి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తన కుమారుడిని సినీ హీరోగా చూడాలన్నది సత్యమూర్తి కోరిక. ఆ కోరిక నెరవేరబోయే తరుణంలో సత్యమూర్తి కన్నుమూశారు.