పేలుడు బాధితులను పరామర్శించిన చంద్రబాబు

 

తూర్పు గోదావరి జిల్లా వాకతిప్పలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటన బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఈ ఘటనలో చనిపోయిన వారి దేహాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాణాసంచా పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు వాకతిప్ప గ్రామంలో పేలుడు సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు.