నెపం నెట్టాలనా.. విభజన ఆపాలనా?

 

లెటర్‌ ఇచ్చిన చంద్రబాబు విబజనకు సహకరిస్తున్నాడు, కిరణ్‌ డ్రామాలాడుతున్నాడు అంటూ వైసిపీ విమర్శిస్తుంది. సమైక్యం ముసుగులో జగన్‌ విభజన కోరుకుంటున్నాడు. సోనియాతో కుమ్మక్కయి బెయిలు తెచ్చుకుని బయటకొచ్చి సినిమా రక్తికట్టిస్తున్నాడు అంటూ తెలుగుదేశం వాళ్లు మేం చిత్తశుద్దితొ పోరాడుతున్నాం. లెటర్‌ ఇచ్చిన చంద్రబాబు, ఆర్టికల్‌ 3 ప్రకారం విభజించుకోమన్న జగన్‌లే సమైక్యద్రోహులు అంటూ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు.. ఇలా ఎవరికి వారు ఒకరి మీద ఒకరు విభజన పాపాన్ని నెట్టాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఎవరి పత్రిక వారికి, ఎవరి చానల్‌ వారికి ఉండటంతో ఏ పార్టీకా మీడియా గొడుగు పడుతూ ఉంది. ఈ గోలలో విభజన ఆపాలనే ఆరాటం కన్నా.. విడిపోయాక చోటు చేసుకునే రాజకీయ పరిస్థితుల నుంచి లబ్ధి పొందాలనే యావే ఎక్కువ కనిపిస్తుండడంతో రాష్ట్రప్రజలు తాము దిక్కులేని వారిమయ్యామని అనుకుంటున్నారంటే .. అది నిజంగా మన రాజకీయనేతల పుణ్యమే..