జగన్‌కు వణుకు ఎందుకు?

 

అధినేత్రిని ఎదిరించి పార్టీ బయటికి వచ్చిన జగన్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ వారిని మించి సోనియాకు దాసోహం అంటున్నాడా? అవుననే అంటున్నారు వర్లరామయ్య. విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ సోనియా పేరు చెబితే జగన్‌కు వణుకు పుడుతుందొన్నారు. సమైక్యం అంటూ జగన్‌ వల్లెవేస్తున్నదంతా బూటకమని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు ఈ ముసుగులో సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఎపిఎన్టీవోల మధ్యచీలిక జగన్‌ కుట్రలో భాగమేనన్నారాయన.