పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద టి.కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

 

 congress mps, telangana congress mps, telangana issue congress, separate telangana congress

 

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గురువారం పార్లమెంట్ వద్ద ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ పార్లమెంట్ ఒకటో నెంబర్ గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అంతకు ముందు ఎంపీ మధుయాష్కీ నివాసంలో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే సభను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని ఎంపీలు తమ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu