కాంగ్రేస్ కు పెరిగిన గ్రాఫ్ నిండా మునిగిన కేసీఆర్ 

అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో నష్టపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందే ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్థులు జమిలీ ఎన్నికల టాక్ తో పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలని అభ్యర్థులకు ఆదేశించారు. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనౌన్స్ చేయడంతో 20 రోజుల పాటు ప్రచారాన్ని బిఆర్ఎస్ తన ప్రచారాన్ని నిలిపి వేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ పుంజుకుంది.  ఈ మధ్య వచ్చిన సర్వేల్లో బిఆర్ఎస్ గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది. జమిలీ ఎన్నికల ఊసు కేంద్రం ఎత్తకపోవడంతో బిఆర్ఎస్ ఖంగుతింది. కేంద్రం అంచనాలను పసి గట్టడంలో బిఆర్ఎస్ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.  ప్రచారానికి విరామం ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది అని పరిశీలకులు అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత సోనియాగాంధి ఈ నెల 17న హైదరాబాద్  తుక్కుగూడకు వచ్చి తాయిలాలు ప్రకటించారు. సిక్స్ గ్యారెంటీస్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ ఇమేజ్ తెలంగాణలో పెరిగింది. కర్ణాటక డిప్యూటీసీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తదితరులంతా తుక్కుగూడకు తరలిరావడం, తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి కారణమైంది.  కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. నెల రోజుల క్రితం బిఆర్ఎస్ జాబితా ప్రకటించిన తర్వాత అటు అసమ్మతి వాదులను బుజ్జగించడం, అభ్యర్థులను గెలిపించుకోవడమే బిఆర్ఎస్ ముందున్న టాస్క్ గా ఉండేది . కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అసమ్మతి పెరిగిపోయింది. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విజయావకాశాలు సన్నగిల్లాయి. బిఫామ్ మీద ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు మెండుగానే ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందే 115 మంది అభ్యర్థులను బిఆర్ఎస్ ప్రకటించింది. కానీ ప్రచారాన్ని ప్రారంభించలేకపోయింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఉండకపోవచ్చు. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ప్రకారం ప్రకటిస్తారు. మహిళా బిల్లు అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ముందు వరసలో నిలిచారు.  మహిళా బిల్లు వల్ల తన సీటు పోయిన పర్వాలేదని కేటీఆర్ ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. బిఆర్ఎస్ అసమ్మతివాదులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని చూస్తోంది. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే , బిఆర్ఎస్ నేత ఇప్పటికే కేసీఆర్ పార్టీకి రాజీ నామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. జమిలీ టాక్ తో   అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రచారాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. సిక్స్ గ్యారెంటీస్  సోనియాగాంధీ ప్రకటించడం, సీడబ్ల్యూసి సమావేశాలు జరగడం  కాంగ్రెస్ పార్టీ  జనాల్లో వెళ్లింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు.  కానీ బిఆర్ఎస్ లో మాత్రం నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చేసింది. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకునే కేసీఆర్ కు నూకలు చెల్లినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.  రెండు సార్లు అధికారంలో వచ్చిన కేసీఆర్ పార్టీ హ్యట్రిక్ కొట్టడం కల్ల అవుతుందని వారు అంటున్నారు.