దయచేసి సచివాలయంలో ఉండండి.. కేసీఆర్ పై ఎర్రబెల్లి ఫైర్


 

టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల బాణాలు వదిలారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని.. కరువు మండలాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపలేదు..  కేసీఆర్ ఒంటెత్తు పోకడకు పోయారు అని విమర్శించారు. మండలానికో కోటి రూపాయలు ఇవ్వాలని.. ఉపాధిహామీ పని దినాలు పెంచాలని.. ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరారు. అంతేకాదు దయచేసి సచివాలయంలో ఉండండి.. రైతలను ఆదుకోండి అని కేసీఆర్ కు సూచించారు. యాగాలకు కేటాయించే సమయంలో కొంచెం రైతులకోసం కేటాయించండి అని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu