కేసీఆర్ చైనా టూర్.. 9 రోజుల నుండి ఒకటే మాట
posted on Sep 16, 2015 12:19PM

మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ పదిరోజుల చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. పదిరోజుల చైనా పర్యటనలో కేసీఆర్ అనేక ప్రదేశాలు.. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఆదరిస్తుంది తదితర అంశాలపై కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తొమ్మిది రోజులు చైనాలోనే పర్యటించిన కేసీఆర్.. అక్కడ ప్రసంగించిన అన్ని రోజులు దాదాపుగా ఒకే అంశం కావడం ఆశ్చర్యకరమైన విషయం. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని ఎర్ర తివాచీతో స్వాగతిస్తామని.. చెప్పిన మాటలనే తొమ్మిది రోజుల నుండి చెప్పడం.. ఆమాటలు కూడా విసిగిపోకుండా వినేలా చేయడం ఆక్రెడిట్ ఒక్క కేసీఆర్ కే దక్కింది. మొత్తానికి చెప్పిన విషయాన్ని తొమ్మి రోజుల నుండి మార్చి మార్చి చెపుతున్నా కేసీఆర్ ఆ పర్యటనలో సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి కేసీఆర్ బృందం హైదరాబాద్ చేరుకోనున్నారు.