అప్పుడు స్నానం కూడా చేయలేదు.. చంద్రబాబు

ఏపీ రాజధానిలో పెట్టుబడులను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం.. సింగపూర్ పర్యటనలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలతో చర్చలతో తీరిక లేకుండా గడిపామని.. రాత్రి పగలు విశ్రాంతి లేకుండా.. కనీసం స్నానం కూడా చేయకుండా పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుండి పారిశ్రామిక వేత్తలు తరిలి వస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఏపీలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. ఒకప్పుడు విజయవాడ అంటే రౌడీయిజం అంటూ భయపడే పరిస్థితి ఉండేది.. ఆ అరాచకాలను అణచివేయగలనని చెప్పారు. ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే విధంగా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని.. విజయదశమి రోజున జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి భారతదేశం, సింగపూర్ ప్రధాన మంత్రులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu