మానవ తప్పిదాల వల్లే ఏపీలో కరువు.. చంద్రబాబు


ఏపీ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేకహోదాపై ఆయనతో చర్చించామని.. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారని.. ఇద్దరికి సమన్యాయం చేయమని కోరా.. విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని తెలిపామని చెప్పారు. ఐదేళ్ల తర్వాత కూడా ఏపీ లోటులో ఉంటుందని.. దీనిలో భాగంగానే ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రధాని మోడీకి అందజేశామన్నారు. అంతేకాదు కరువుపై భేటీ నిధుల కోసం కాదు.. మానవ తప్పిదాల వల్లే ఏపీలో కరువు తీవ్రత పెరుగుతోందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu