అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా చేస్తాం. చంద్రబాబు

 

ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రకాష్ దేవకర్ కొత్తూరు తాడేపల్లిలో వనమహోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్ధులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్టుపై మమకారం పెంచుకోవాలని.. చెట్టుతో మనిషికి అవినాభావ సంబంధం ఉందని.. పర్యావరణంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఏపీ రాజధాని అయిన అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా అభివృద్ది చేస్తామని.. 15 నగర వనాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ జవదేకర్‌ మాట్లాడుతూ కొల్లేరు పక్షులనే కాదు....ప్రజలనూ కాపాడాల్సిన అవసరముందని అన్నారు. చట్టాలను సవరణ చేసైనా ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu