రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. చంద్రబాబు

 

తెదేపా 34వ మహానాడు మూడవరోజు ఘనంగా ప్రారంభమైంది. మూడవ రోజు కూడా ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి సొమ్ముతో రాజకీయ హత్యలకు పాల్పడిందని, పరిటాల రవిని నిరాయుధుడిని చేసి దారుణంగా హత్య చేశారని దుమ్మెత్తి పోశారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి కాని, రాష్ట్రానికి కాని ఒరిగిందేమి లేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. శాంతి భద్రతలు అనేవి నాగరికతకు చిహ్నం అని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండాలని అన్నారు. వాళ్లకు హాని చేసే ఎలాంటి అరాచక శక్తులనైనా ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు. అంతేకాక ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి కఠిన చర్యలు చేపడుతున్నామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu