బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం.. కోర్టు...

 

బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరమైనదని, దీన్ని పూర్తిగా నిర్మూలించాలని ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఓ బాలికపై వరకట్న వేధింపుల కేసును మెట్రోపాలిటన్ కోర్టు విచారించింది. బాల్య వివాహం చేయడంతో పాటు కట్నం ఇచ్చినందుకు, తీసుకున్నందుకు బాలిక తల్లిదండ్రులు, అత్తింటివారిపై కేసు నమోదు చేయాలని మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ పోలీసులను ఆదేశించారు. తమ కూతురికి చిన్నతనంలోనే వివాహం చేసిన నేరం మీద బాలిక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆడపిల్లకు చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల తమ విద్యను కొనసాగించలేరు. శారీరక హింసలకు, హెచ్‌ఐవీ వంటి వ్యాధులకు గరవుతారు. గర్భవతులైనప్పుడో, కాన్పు సమయంలోనో తరచు మరణిస్తుంటారు. ఇది అత్యంత బాధాకరం అని మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ పేర్కొన్నారు.