దావూద్ గ్యాంగ్ గుట్టు విప్పుతా.. చోటా రాజన్
posted on Nov 6, 2015 11:04AM

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను భారత్ తీసుకొచ్చారు. ఇండోనేషియాలో బాలి జైల్లో ఉన్న చోటా రాజన్ ను ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించారు. అయితే ఎయిర్ పోర్ట్ లో దిగగానే చోటా రాజన్ భూమిని ముద్దాడారు. కాగా ఎయిర్ పోర్ట్ నుండి చోటా రాజన్ ను జైలుకు తరలించేందుకు డమ్మీ కాన్మాయ్ ను వాడింది. అయితే చోటా రాజన్ తనకు ముంబై పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పిన కారణంగా అతని కేసులపై విచారణను బాధ్యతను సీబీఐకి అప్పగించారు. దీంతో చోటారాజన్ పై ఉన్న అన్ని కేసులు సీబీఐకి బదీలీ చేశారు. చోటా రాజన్ పై మొత్తం ముంబైలో 75, ఢిల్లీలో 10 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో చోటా రాజన్ విచారణ జరపనున్నారు.. అంతేకాదు దావూద్ గ్యాంగ్ గుట్టు విప్పుతానని చోటా రాజన్ చెప్పాడు.