కేసీఆర్ ఇంటికెళ్లి మరీ పిలుస్తా.. కేసీఆర్ రియాక్షన్ ఇదేనా?

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈవిషయంపై  వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు స్వయంగా పిలుస్తానని చెప్పినంత వరకూ బానే ఉంది మరి ఈ వార్త విన్న కేసీఆర్ రియాక్షన్ ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరిని తొలుస్తుంది. ఎందుకంటే టీవీ లైవ్ లో వచ్చిన కేసీఆర్ అసలు ఈ మాటలు విన్నరా? వింటే ఎలా స్పందించారు? అన్న సందేహ పడుతున్న సమయంలో కొన్ని ఆసక్తివార విషయాలు తెలిశాయి. వివరాల ప్రకారం.. చంద్రబాబు ఆ మాట అన్న కొద్ది నిమిషాలకే కేసీఆర్ కు వార్త తెలిసిందట.. అయితే ఆయన ముహూర్తం ఎన్నిగంటలకు అని అడిగారట. అయితే ఆయన ఒక్క మూహుర్తం ఎప్పుడు అన్న ఒక్క మాట మాత్రమే అడిగారని.. అంతకు మించి ఎక్కవ ఏం మాట్లాడలేదని.. శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేది లేనిది గురించి ఏం మాట్లాడలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేసీఆర్ అలా అడగటంపై పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు వాస్తు.. మూహూర్తాలపై నమ్మకం ఎక్కువ కాబట్టి ఆకోణంలో అడిగి ఉంటారని.. తనకు వెళ్లే ఛాన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అని కొందరు.. ఇంకా కొంతమందైతే ఆ సమయంలో కావాలనే ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారేమే అని ఎవరికి నచ్చినట్టు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంతకీ కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో అడిగారో ఆయనకే తెలియాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu