చంద్రబాబు పాదయాత్రకు ఐటీ నిపుణుల సంఘీభావం

chandrababu padayatra, chandrababu meekosam yatra, tdp padayatra, chandrababu telangana

 

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు ముందుచూపే కారణమని తెదేపా సీనియర్ నేత యనమల్ రామకృష్ణుడు అన్నారు. చెంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఐటీ నిపుణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి రంగారెడ్డి జిల్లా పరిగి వరకూ ర్యాలీ నిర్వహించారు. నాడు రైతు బిడ్డలుగా ఉన్నవారంతా సాఫ్ట్ వేర్ పరిశ్రమ ద్వారా ఉద్యోగాలు పొంది నేడు లక్షల్లో జీతాలు తీసుకొనే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు యాత్రకు మద్దతు తెలుపుతున్న ఐటీ నిపుణులంతా భవిష్యత్తులో చంద్రబాబు నాయకత్వం మళ్ళీ వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. టిడిపి నేత పెద్దిరెడ్డి తో పాటు ఐటీ పరిశ్రమలకు చెందిన నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu