కరీంనగర్‌లో నేడు బాబు పర్యటన

 

నేడు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించబోయే తెదేపా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు పార్టీ నేతలకు ఈ సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు 11 గంటలకు కరీంనగర్ జిల్లా సరిహద్దు మండలమయిన తిమ్మాపూర్ హెలికాఫ్టర్ ద్వారా చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా 12 గంటలకు అంబేద్కర్ స్టేడియం చేరుకొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశానికి హాజరయిన పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత జిల్లాలో నియోజకవర్గాల వారిగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.

 

ఈ సమావేశానికి దాదాపు 25,000 మంది పార్టీ నేతలు హాజరు కావచ్చునని భావిస్తున్నారు. జిల్లాలో గ్రామ స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు పార్టీ అధ్యక్షులని, సభ్యులందరూ హాజరవుతారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యల్. రమణ తెలిపారు. కొన్ని రోజుల క్రితం వరంగల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన పార్టీ సమావేశంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెదేపా నేతలు ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు.