నేడు తుళ్ళూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటన
posted on Mar 3, 2015 7:14AM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తుళ్ళూరు మండలంలో గ్రామాలలో పర్యటించిబోతున్నారు. ఆయన మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గ్రామం నుంచి తన పర్యటన ప్రారంభించి, రాజధాని కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాలలో రైతులను, వ్యవసాయ కూలీలను కలిసి వారితో మాట్లాడి, భూసేకరణపై వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకొ౦టారు.
వారికి తమ పార్టీ అన్ని విధాల అండగా నిలబడుతుందని తెలిపి వారికి దైర్యం చెప్పేందుకే జగన్మోహన్ రెడ్డి తుళ్ళూరులో పర్యటిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. తమ పార్టీ తుళ్ళూరులో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ రాజధాని కారణంగా రైతులకు, పంటభూములకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తపడమని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.