కాంగ్రెస్‌ దుష్టపాలనలో రైతులు బలి

కాంగ్రెస్‌ పార్టీని హయాంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని, దాదాపు 25 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దుష్టఆలోచనతో కాంగ్రెస్‌ రెండు రాష్ర్టాలలోనూ బోర్లా పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తన విధానాలవల్ల భూస్థాపితం అయ్యిందని, ఇక కోలుకునే పరిస్థితి లేదని ఆయన పునరుద్ఘాటించారు. పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి ఆలవాలంగా కాలయాపన చేసి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో, తెలంగాణాలో టీఆర్‌ఎస్‌తో మిలాఖత్‌ కావడం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని విఫలయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. కానీ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఆ పార్టీకి జీవితకాలం గుణపాఠం చెప్పారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu