కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రయోజనం లేదు...


ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విభజన వల్ల ఏపీకి నష్టం జరిగింది..ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు... ఓపిగ్గా నాలుగేళ్లు వేచి చూశాం... కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రయోజనం లేదనిపించింది.. అందుకే ఎన్డీయే నుండి బయటకు వచ్చాం.. చేయాల్సిన సాయం చేయకపోగా నిందలు వేస్తున్నారని అన్నారు. కేంద్రం తీరు చూసి ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారు.. పార్లమెంట్లో ఎంపీలు ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu