అమెరికా అధ్యక్షుడి కంటే బాబు ఖర్చే ఎక్కువట
posted on Oct 15, 2015 1:28PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు, టీడీపీ ప్రభుత్వం హంగూ ఆర్భాటాలతో పాలన సాగిస్తోందన్న ఆయన.... చంద్రబాబు విమాన ప్రయాణాల ఖర్చే వంద కోట్లు ఉంటుందని ఆరోపించారు, అమెరికా అధ్యక్షుడు కంటే ఎక్కువగా చంద్రబాబు తన పర్యటనల కోసం ఖర్చు పెడుతున్నారని లోక్ సత్తా జేపీ విమర్శించారు. ఎప్పుడూ అమరావతి జపం మాత్రమే చేస్తూ మిగతా ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నారని, చంద్రబాబు విధానాలతో మరోసారి ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చే అవకాశముందని జేపీ వ్యాఖ్యానించారు, రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఏపీని నిధుల దుబారాతో చంద్రబాబు మరింత కష్టాలు పాలు చేస్తున్నారని జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు.