ఇంటింటికీ టిడిపి

 

 chandrababu, tdp atma gourava yatra, naidu yatra, chandrababu new plan, atma gourava yatra

 

 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రతో పాటు తమ కార్యకర్తలకు కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా క్యాడరు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టనున్నారు. కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కాంగ్రెస్ రాజకీయాలు,విభజనలో ఉన్న కుట్ర,తదితర అంశాలను వివరించాలని చంద్రబాబు నాయుడు కార్యకర్తలను కోరుతున్నారు. విభజన మూలంగా రాష్ట్రంలో ఏర్పడే ఇబ్బందులతో పాటు, అవినీతి నేతలను ఎన్నుకుంటే వచ్చే ఇబ్బందులను కూడా గడపగడపకు ప్రచారం చేయాలని నిర్ణయించారు. నవంబరులో రెండో విడత ఆత్మగౌరవ యాత్ర విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మొదలు కానుంది.