కాల్ మనీ..రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు

కాల్ మనీ దందా  వ్యవహారంలో తవ్విన కొద్ది అక్రమార్కులు బయటపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. వడ్డీ వ్యాపారులు నుండి కీలకమైన పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాదీనం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కాల్ మనీ ఆరోపణలపై ప్రకాశం జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించి.. మార్కాపురంలో నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా కాల్ మనీ వ్యవహారంపై వడ్డీ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇంక ఒంగోలులో కూడా ఫైనాన్షియర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu