క‌విత ఇర‌వై ల‌క్ష వాచీకే షాకైన జ‌నం

 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ దేవుడు అంటూనే అటు త‌న సొంత నిర్ణ‌యాలు తాను తీసుకుంటున్నారు. త‌న తండ్రి చేసే తప్పులు వ‌రుస‌గా దిద్దే య‌త్నం చేస్తున్నారు. మొద‌టిది తెలంగాణ వాదాన్ని తిరిగి త‌ట్టి లేపడం. అందుకే అట‌క మీదున్న తెలంగాణ జాగృతి బుట్టను కింద‌కు దించారు. ఎక్క‌డో ఉన్న రాజీవ్ పేరిట ఇంకా ప‌థ‌కాలు పెట్ట‌డ‌మేంటి? ఇక్క‌డి వారి  పేర్లు పెట్టాలి అంటూ ఆమె తెలంగాణ యాంగిల్ ని తిరిగి ట‌చ్ చేశారు. ఈ దిశ‌గా సంకేతాల‌ను ఇచ్చారు. ఇపుడామె స్కెచ్ ఏంటంటే, ఆనాడు భాష ద్వారా  క‌ల‌సిన ఆంధ్ర నుంచి వేరు ప‌డ్డానికి మొద‌లైనది తొలి ఉద్య‌మం అయితే.. త‌న తండ్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో జ‌రిగింది మ‌లి తెలంగాణ ఉద్య‌మం అయితే.. త‌న తండ్రే రేప‌టి రోజున  జైలుకు వెళ్తే.. మూడో మారు ఉద్యమం చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయ‌న్నొక జాతి పిత‌గా  ప‌దే ప‌దే అంటూ, ఇటు అధికార  పార్టీకి అటు తెలంగాణ వాదుల్లోకి ఒక సంకేతాల‌ను పంపారు. 

కేసీఆర్ కి నోటీసులు ఇవ్వ‌డం అంటే అది తెలంగాణ‌కు నోటీసులు ఇవ్వ‌డంతో స‌మాన‌మంటూ త‌న శ్రేణుల‌ను త‌ట్టి లేపుతున్నారు క‌విత‌. అంతే కాదు.. ఇందుకు బీసీ యాంగిల్ సైతం యాడ్ చేస్తున్నారు. బీసీల‌తో పాటు క్రిష్టియ‌న్- ముస్లిం- సిక్ వంటి మైనార్టీల‌తో స‌హా కొమ్ము కాస్తానంటూ ఆ  శ్రేషులంద‌రినీ తిరిగి రీయాక్టివేట్ చేస్తున్న చ‌ప్పుడు వినిపిస్తోంది.. ఆమె మాట‌ల్లో! ఒక వేళ కేసీఆర్ కి ఏదైనా జ‌రిగితే వెంట‌నే వీరంద‌రి సాయంతో ప్ర‌త్య‌ర్ధుల‌ను తిరిగి  తెలంగాణ వాదంతో కొట్టేలా ప‌థ‌క ర‌చ‌న చేస్తున్నట్టు క‌నిపిస్తోంది. ఇదంతా ఒక సెక్యూరిటీ ప‌ర్ప‌స్. భ‌ద్ర‌తాకంచె క‌ట్ట‌డంలో భాగ‌మే అన్న‌ది  రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఇక్క‌డ క‌వితే ఎందుకంటే.. ఇటు కేటీఆర్ అటు హ‌రీష్ సైతం కాళేశ్వ‌రం అనే ఒక స‌మ‌స్య‌లో ఉన్నారు. కేటీఆర్ సంగ‌తి స‌రే స‌రి. ఈ కార్ రేస్ అనే క‌ళ్లం ఆయ‌న్ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్ప‌టికే సిద్ధం చేసి ఉంచారు. కాబ‌ట్టి.. తాను వీరందరిలోకి తానే సీనియ‌ర్ కాబ‌ట్టి.. లిక్క‌ర్ కేసులో ఇప్ప‌టికే జైలుకెళ్లి వ‌చ్చిన అనుభ‌వ‌జ్ఞురాలు కాబ‌ట్టి.. ఆమెకున్న ధైర్యం వీరికి ఉండ‌క పోవ‌చ్చు... అందుకే ఆమె లీడ‌ర్షిప్ హ్యాండిల్ చేయ‌డానికి ముందుకొస్తున్నారు.

అంటే  ఈ ముగ్గుర్ని జైళ్ల‌కు పంపినా.. వ‌చ్చే రోజుల్లో త‌న శ్రేణుల‌తో క‌ల‌సి మూడో ఉద్య‌మం చేసి.. రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించ‌డానికి ఆమె ప్లాన్ చేస్తున్నార‌న్న మాట‌. అందుకే అంటోంది కేసీఆర్ పై ఈగ‌వాల‌నియ్యం అంటే దాన‌ర్ధం ఇదేన‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక వేళ కేసీఆర్ జైలుకెళ్లే ప‌రిస్థితి వ‌స్తే.. క‌విత త‌న జాగృతి శ్రేణుల ద్వారా మ‌రో తెలంగాణ ఉద్య‌మానికి రంగం సిద్ధం చేస్తున్నార‌న్న‌మాట‌.ఇక క‌విత త‌న  ద‌గ్గ‌రున్న నిధుల‌ను ఈ ఉద్య‌మాల‌కు వాడుతారా? లేక డాడీ నుంచి తీసుకుంటారా? అని కొంద‌రికి అనుమానం. అయితే లిక్క‌ర్ స్కామ్ లో క‌విత ఒక స్తాయిలో వెన‌కేసిన‌ట్టుగా చెబుతారుకొంద‌రు. కాదు.. కేసీఆరే స్వ‌యంగా త‌మ ద‌గ్గ‌ర అధికారికంగా వెయ్యి కోట్ల ధ‌న‌పు నిల్వ‌లున్నాయ‌ని ప్ర‌క‌టించారు. ఒక స‌మ‌యంలో బీజేపీయేత‌ర పార్టీల‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చు సైతం తానే భ‌రిస్తాన‌ని అన్నారు. 

అలాంటిది కేసీఆర్ త‌న బిడ్డ‌కు ఇవ్వ‌రా? అన్న‌ది మ‌రో వాద‌న‌.ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ క‌బ‌డ్డీలో.. ప్ర‌ధాన ఆట‌గాళ్లు బ‌రి బ‌య‌ట ఉన్నారు. ఇప్ప‌టికే ఈ కార్ రేసులో కేటీఆర్ దాదాపు ఔట్ అయ్యే ప‌రిస్థితి. కాళేశ్వ‌రం ఇష్యూలో ఇటు కేసీఆర్ అటు హ‌రీష్ సైతం నిందితులుగా ముద్ర వేయించుకున్నారు. దాన్ని కాంగ్రెస్ క‌మీష‌న్ అన్నా, కాళేశ్వ‌రం క‌మీష‌న్ అన్నా.. దాని ప‌ని అది చేస్తుంది. ఇక మిగిలింది స‌బ్ స్టిట్యూట్ క‌విత మాత్ర‌మే. ఆమె ఒక్క‌రే ఈ ముగ్గురు మ‌రాఠీల‌ను గ‌ట్టెక్కించ‌గ‌ల స‌మ‌ర్ధురాలుగా అంచ‌నా. అందుకే ఇంత హైడ్రామాగా భావిస్తున్నారు.  ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి కేసీఆర్ కి ఏ చిన్న హాని  జ‌రిగినా వెంట‌నే క‌విత త‌న జాగృతిని తెలంగాణ అనే ఆయుధంతో తిరిగి జాగృతం చేస్తార‌న్న‌మాట‌. మ‌రి దీనంత‌టికీ కాంగ్రెస్ రెడీగా ఉందా? ఇప్ప‌టికే సీఎం రేవంత్ కి రాహుల్ అపాయింట్మెంట్లు దొర‌క‌డం లేదు. పొమ్మ‌న లేక పొగ పెడుతున్నార‌న్న టాక్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌నంత చొర‌వ తీసుకుంటారా? లేక ఏది ఏమైనా త‌న‌ను జైలుకు పంపిన కేసీఆర్ పై ఎలాగైనా రివేంజ్ తీర్చుకుంటారా? తేలాల్సి ఉంది. ఇందుకు క‌విత రియాక్ష‌న్ ఎలా ఉండ‌బోతుంద‌న్న కొత్త ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేస్తోంది.