ప్రశ్నలు భరించలేక ఏడ్చేసిన యడ్యూరప్ప..


కర్ణాటక మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఏడ్చేశారంట. అంతలా యడ్యూరప్పను ఏడిపించింది ఎవరబ్బా అనుకుంటున్నారా. సీబీఐ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏడ్చేశారంట. అసలు సంగతేంటంటే.. యడ్యూరప్ప నిర్వహిస్తున్న ప్రేరణా ట్రస్ట్ రూ.20 కోట్ల నిధులు అందుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టులో విచారణ జరుగగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న స్కాంలపై కోర్టు ప్రశ్నలు సంధించింది. అయితే ఒకటి కాదు రెండు కాదు రెండున్నర గంటల వ్యవధిలో ఏకంగా 475 ప్రశ్నలను అడిగారు. దీనికి యడ్యూరప్పా భావోద్వేగానికి గురై.. తానే తప్పూ చేయలేదని స్పష్టం చేస్తూ, చట్ట పరిధిలోనే పాలన జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే పని చేయలేదని అన్నారు. ఇంకా చెబుతూ ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu