లేచిన గుర్రం శక్తిమాన్.. ఎమ్మెల్యే గణేష్ జోషీ అరెస్ట్

 

బీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా గణేష్ జోషీ అశ్వక దళానికి చెందిన శక్తిమాన్ అనే గుర్రంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శక్తిమాన్ బాగా గాయపడగా దాని కాలు విరిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ కాలును తొలగించి నడవడానికి వీలుగా ఉండే మరో ప్లాస్టిక్ కాలును పెట్టారు. అయితే ఇకనుండి అది పరిగెత్తలేదని.. నడవడం వరకే కుదురుతుందని వైద్యులు చెప్పారు. కాగా చికిత్స అనంతరం రెండు రోజులు లేవని శక్తిమాన్ ఈ రోజు లేచి నిల్చున్నట్టు తెలుస్తోంది.

 

మరోవైపు ఎమ్మెల్యే గణేష్ జోషీ మాత్రం తాను గుర్రంపై ఎలాంటి దాడి చేయలేదని చెబుతున్నా.. గుర్రంపై దాడి చేసి గాయపరిచిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషీని పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.