ప్రేమను నిరాకరించిందని... ఐదుగురిపై యాసిడ్ దాడి

పంజాబ్ రాష్ట్రంలో ఓ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమకు నిరాకరించిందని.. ఓ బాలుడు తను ప్రేమించిన అమ్మాయితో పాటు తన స్నేహితురాళ్లపైన కూడా యాసిడ్ దాడి చేశాడు. వివరాల ప్రకారం..  పంజాబ్ దేశంలో గురుదాస్ పూర్ పట్టణంలోని డేరా బాబా నానక్ ప్రాంతంలో ఓ బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే తను అదే పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాడు. కానీ బాలిక మాత్రం తన ప్రేమను నిరాకరించిది. దీంతో ఆ బాలుడు పాఠశాల నుండి సాయంత్రం ఆ బాలికలు ఇళ్లకు బయలుదేరి వెళ్లే సమయంలో తన స్నేహితుడి బైక్ పై ఫాలో అయి ఆ బాలికతో పాటు పక్కన ఉన్న ఆమె స్నేహితురాళ్లపైన కూడా యాసిడ్ పోసి  పారిపోయాడు. యాసిడ్ దాడికి బాలికలు బాధతో పెద్దగా అరవగా.. ఇరుగుపొరుగున ఉన్న వారు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈదాడిలో బాలిక పరిస్థితి మాత్రం విషమంగా ఉందనే వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారికి స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.