Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మేం మందు తాగం- బీహార్లో తండ్రుల ప్రతిజ్ఞ
posted on: Mar 10, 2016 1:57PM

వచ్చే ఏప్రిల్ 1 నుంచి బీహార్లో మద్యనిషేధాన్ని అమలుచేసేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందు దేశవాళీ మద్యాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్కుమార్ వెల్లడించారు. ఎంతో కొంత సెంటిమెంటు లేకపోతే ఈ మద్యనిషేధం విజయవంతం కాదనుకున్నారో ఏమో... నితీశ్ ఓ వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73 వేలమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తండ్రులకు ఓ ప్రతిజ్ఞా పత్రాన్ని అందచేయనున్నారట. ‘మా పిల్లల క్షేమం కోరి మేము మద్యం జోలికి పోము’ అన్నదే ఈ ప్రతిజ్ఞ సారాంశం. ఇలా కనీసం పిల్లల మొహాలు చూసైనా ఇంటిపెద్దలు మద్యాన్ని మానేస్తారన్నది నితీశ్ ఆశ! మద్యనిషేధం విషయంలో తాము ఎలాంటి విమర్శలనూ పట్టించుకోమనీ, అనుకున్నది సాధించి తీరతామని నితీశ్ సెలవిస్తున్నారు.


.jpg)
.jpg)


