మేం మందు తాగం- బీహార్లో తండ్రుల ప్రతిజ్ఞ

 

వచ్చే ఏప్రిల్ 1 నుంచి బీహార్లో మద్యనిషేధాన్ని అమలుచేసేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందు దేశవాళీ మద్యాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వెల్లడించారు. ఎంతో కొంత సెంటిమెంటు లేకపోతే ఈ మద్యనిషేధం విజయవంతం కాదనుకున్నారో ఏమో... నితీశ్‌ ఓ వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73 వేలమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తండ్రులకు ఓ ప్రతిజ్ఞా పత్రాన్ని అందచేయనున్నారట. ‘మా పిల్లల క్షేమం కోరి మేము మద్యం జోలికి పోము’ అన్నదే ఈ ప్రతిజ్ఞ సారాంశం. ఇలా కనీసం పిల్లల మొహాలు చూసైనా ఇంటిపెద్దలు మద్యాన్ని మానేస్తారన్నది నితీశ్‌ ఆశ! మద్యనిషేధం విషయంలో తాము ఎలాంటి విమర్శలనూ పట్టించుకోమనీ, అనుకున్నది సాధించి తీరతామని నితీశ్‌ సెలవిస్తున్నారు.