ఈరోజు ముగిసిన భూమన విచారణ..రేపు మళ్లీ..

 

తుని ఘటనలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదారుగంటల పాటు  భూమన కరుణాకర్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. ఈరోజు విచారణ ముగియగా రేపు మళ్లీ విచారణలో పాల్గొనాలని సీఐడీ ఆదేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనంలో తప్పుడు ప్రచారం చేసేందుకు నన్ను పిలిచారు.. టీడీపీ ప్రభుత్వ కుట్ర ప్రకారమే నన్ను విచారణకు పిలిచారు అని అన్నారు. అంతేకాదు చంద్రబాబు రూథర్ ఫర్డ్ లాంటివాడు.. రూథర్ ఫర్డ్ గిరిజనులను ఏరిపారేసినట్టు..చంద్రబాబు కాపులను ఏరిపారేస్తున్నాడు అని ఆరోపించారు. చంద్రబాబు బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదు..మా పార్టీ ముద్రగడకు పూర్తి మద్దతు తెలుపుతుంది అని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu