అవసరమైతే అర్ధరాత్రి వరకు ఓటింగ్: భన్వర్‌లాల్

 

తెలంగాణలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తప్ప సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైన పక్షంలో అర్ధరాత్రి వరకు అయినా పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ బూత్‌ దగ్గరకి వచ్చిన ఓటర్లందరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని, 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్ని వందలమంది ఓటర్లు ఉన్నా వారందరూ ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. అవసరమైతే అర్ధరాత్రి వరకు అయినా ఓటింగ్‌కి అనుమతి ఇస్తామని భన్వర్ లాల్ చెప్పారు.