టికెట్ రాలేదని ఏడ్చేసిన నాయకుడు

ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు హామీలివ్వడం కామన్.. ఒకవేళ గెలిచారో అంతే తరువాత ఆ హామీల గురించి మళ్లీ ప్రజలు గుర్తు చేసేవరకూ గుర్తుండవు. అధికారం రావడానికి ఎన్ని మాటలైనా మాట్లాడతారు. అలాంటిది ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు చేసిన ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చాల్సిన నాయకుడే తనకు పదవి రాలేదంటూ బోరున విలపించాడు. బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో ఈ ఆర్ ఎస్ ఎల్ పి లీడర్ అశోక్ గుప్తా ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదని బోరున ఏడ్చేశాడు. దీనిలో భాగంగానే తమ అధినేత కుష్వాహా ఎదుట దయచేసి నాకు ఒక టికెట్ ఇవ్వండంటూ.. కాళ్లావేళ్లపడి బతిమాలాడు. టికెట్ కోసం డబ్బులిచ్చానని.. ఆ డబ్బంతా గంగపాలైందని శోకాలు పెట్టారు. అయితే అశోక్ గుప్తా ఒక్కడికే కాదు ఈ ఎన్నికలలో చాలామంది నేతలకు కూడా పార్టీ టికెట్లు దక్కలేదు. కానీ వారెవరూ ఇంత సీన్ క్రీయేట్ చేయలేదు. మొత్తానిక టికెట్ రాలేదని ఏడుస్తున్న రాజకీయ నాయకులు ప్రజలు ఏడ్పును ఏలా తీరుస్తున్నారో..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu