ఫలించని ఎ.పి ఎన్జీవోల చర్చలు

 

ఈ రోజు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రెండు గంటలకు పైగా చర్చలు జరిపిన ఎ.పి ఎన్జీవోల చర్చలు ఫలించలేదు. చర్చల అనంతరం ఏ.పి.ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ, “ఢిల్లీ పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, రాష్ట్ర విభజనపై స్పష్ట మైన హామీ వస్తేనే సమ్మె పై తగు నిర్ణయం తీసుకుంటామని” అశోక్ బాబు తెలియచేసారు. తుఫాను వచ్చే ప్రమాదమున్నందున ఉద్యోగులు సహకరించాలని కోరుతున్నందున సమ్మెలో కొనసాగుతూనే సహాయక చర్యలు అందింస్తామని ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు అశోక్ బాబు తెలిపారు. తాను సి.ఎం. గా ఉన్నంత వరకు రాష్ట్రం సమైఖ్యంగా ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే కేవలం సి.ఎం. హామీకి స్పందించి ఏ నిర్ణయమూ తీసుకోలేమని, తమకు కేంద్రం స్పష్టమయిన హామీ ఇచ్చినప్పుడే సమ్మె విరమించే ఆలోచన చేస్తామని అశోక్ బాబు మీడియాకు తెలిపారు.