ఎస్మా ప్రయోగించండి .... పి.సి చాకో

ఎ.ఐ.సి.సి అధికార ప్రతినిధి పి.సి చాకో ఎ.పి ఎన్జీవోల సమ్మెనుద్దేశించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల పై ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తేవాలని చాకో అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున, వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని సి.ఎం  కు సూచించినట్లు చాకో అన్నారు.