ఏపీస్ ఆర్టీసీ త్వరలో ప్రభుత్వంలో విలీనం?

 

ఏపీస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక త్వరలో తీరబోతోంది. నిన్న విజయనగరంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పీతల సుజాత కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సంబంధిత అధికారులు అవసరమయిన చర్యలు మొదలుపెట్టారని చెప్పారు. అదే విధంగా ఆర్టీసి కార్మికుల సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న పలుచర్యలను ఆమె వివరించారు. అనంతరం మాట్లాడిన ఆర్టీసీ మేనేజిన్ డైరెక్టర్ నండూరి సాంభశివరావు, రాష్ట్రంలో 13జిల్లాలలోను ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆదినీకరించే ప్రక్రియ కూడా మొదలుపెట్టమని, ఆర్టీసీ నష్టాలను తగ్గించుకొనేందుకు కూడా అనేక చర్యలు చేపదుతున్నామని తెలిపారు. ఒకవేళ మంత్రి చెపుతున్నట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లయితే దానికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతుంటాయి కనుక సంస్థ నష్టాల్లో నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu