ఏపీలో హెల్త్ కేర్ ఏటీఎంలు.. ఒక్క క్లిక్ తో..

 


ఏపీ ప్రభుత్వం మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మరింత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలో ఒకటి.. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి.. మొత్తం 25 హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఏటీఎం సెంటర్లలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఔషధాలు లభిస్తాయి. తలనొప్పి, మధుమేహం, జ్వరం వంటి రోగాలకు ఔషధాలు ఒక్క క్లిక్ తో లభిస్తాయి. వీటి ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నది మోదీ సర్కారు నిర్ణయం. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా వీటిల్లో ఔషధాలను నింపుతారు. ఒకవేళ రుగ్మత అధికంగా ఉంటే, ఏటీఎం మెషీన్ ద్వారానే సమీపంలోని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చేందుకు కూడా వీలుంటుంది. కాగా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని మార్చిలోనే కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu