రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు

 

 

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారస్ చేస్తూ కేంద్రానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివేదిక పంపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఎవరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో, రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కేంద్రానికి నివేదికనిచ్చారు. దీనిపై సాయంత్రం కేంద్ర కేబినేట్ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితులు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై చర్చిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu