రాష్ట్ర అవతరణ వేడుకలు: కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

 

 

 

ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియ౦ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎ౦ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతాయా,లేదా అన్న అనిశ్చితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలుగు మాట్లాడే వారందరి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, బూర్గుల రామకృష్ణ రావు పదవీ త్యాగం చేశారని అన్నారు. తెలుగు వారు ఉన్నత శిఖరాలకు ఎదిగి భారత దేశానికి దశ దిశ చూపిన సంజీవ రెడ్డి, పివి నరసింహ రావు వంటి వారికి జోహార్లు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu