ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల

గత నెల జరిగిన ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ ఫలితాలను విడుదలచేశారు. డీఎస్సీలో మొత్తం 10,313 పోస్టులకు 3 లక్షల 90వేల మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. ఈ సందర్బంగా గంటా మాట్లాడుతూ అభ్యంతరాలన్నీ పరిశీలించి 13 పొరపాట్లను గుర్తించామని, పొరపాట్లన్నీ నిపుణుల ద్వారా సవరించిన తరువాతే ఫలితాలు విడుదల చేశామన్నారు. బంగాల్ లో పరిస్థితి వేరు ఇక్కడి పరిస్థితి వేరని, అక్కడ అభ్యర్ధులు లేక బీఈడీ వాళ్లకు ఎస్జీటీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఇక్కడ మాత్రం బీఈడీ అభ్యర్ధులకు ఎస్జీటీ అవకాశం లేదని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu