ఈ మనిషికి నిద్ర ఎలా పడుతోంది?.. జగన్ పై ఫైర్!!

రాజధాని అంశంతో ఏపీ వాతావరణం వేడెక్కింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టడంతో.. రాజధాని ఉద్యమం మరింత ఉధృతమైంది. రైతులు, మహిళలు.. అరెస్టులు, లాఠీ దెబ్బలు లెక్కచేయకుండా.. పోరాడుతున్నారు. ప్రస్తుతం అమరావతి ఆందోళనతో అట్టుడుకుతోంది. అయితే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీలో ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటూ.. టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. "ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే... మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే... ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?" అని లోకేష్ మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu